జూబ్లీహిల్స్, ఏప్రిల్ 29: ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సమస్యలను త్వరితగతిన పరిష్కరించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి జి.వరప్రసాద్ తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారానికి సోమవారం మాదాపూర్ కావూరి హిల్స్లోని సన్మేడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో ‘నిధి ఆప్కే నిఖత్ 2.0’ పేరిట క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించేందుకు.. కేవైసీ, పుట్టిన తేదీ.. తదితర సవరణలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్స్ పి.మేఘన, రాహుల్ రావత్, సన్మేడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు పాల్గొన్నారు.