తిరుమల : చంద్ర గ్రహణం ( Lunar eclipse ) కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు తిరుమల ( Tirumala ) లోని శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు ( Close ) . ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్యూలైన్లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసినట్లు చెప్పారు.

ఆలయ మూత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని చోట్ల పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.