తిరుమల : ఆపదమొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala) కు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో ని 13 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 69,981 మంది భక్తులు దర్శించుకోగా 20, 492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు వచ్చిందని వివరించారు.