అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరును మారుస్తూ నెలరోజుల క్రితం తీసుకున్న ప్రాథమిక నిర్ణయంపై చెలరేగిన హింసాకాండ పునరావృతం కాకుండా కోనసీమ జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్లో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఆమోదం తెలుపడంతో అల్లర్లు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గత నెల 24న ప్రభుత్వ నిర్ణయంపై నిరసనకారులు మంత్రి, ఎమ్మెల్యే ఇండ్లకు నిప్పంటించడం, బస్సులను దహనం చేయడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు.
అప్పటి నుంచి జిల్లాలో 144 సెక్షన్తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసు యాక్టు 30ని అమలు చేస్తున్నారు. 15 రోజుల పాటు జిల్లాలోని 16 మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అల్లర్లకు పాల్పడ్డ 258 మందిలో 217 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఏడు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు.
అల్లర్లను పసిగట్టడంలో జిల్లా పోలీసు అధికారి విఫలమయ్యారన్న ఆరోపణ మేరకు జిల్లా ఎస్పీని ఇటీవల నిర్వహించిన బదిలీలలో మరో ప్రాంతానికి బదిలీ చేశారు.