న్యూఢిల్లీ: ఇండియా జాతీయ జంతువు టైగర్. ఆ పులి ముఖం ఉన్న విమానం ఇవాల నమీబియాకు చేరుకున్నది. అక్కడ ఉన్న ఇండియన్ కమిషన్ పులి ఫేస్ ఉన్న విమాన ఫోటోలను రిలీజ్ చేసింది. అయితే నమీబియా నుంచి మొత్తం 8 చీతాలను ఇండియాకు తీసుకురానున్నారు. దీని కోసం ప్రత్యేక విమానం ఆ దేశానికి వెళ్లింది. అయితే ఆ విమానం ముఖ భాగాన్ని పులి ఫోటోతో డిజైన్ చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తన ట్విట్టర్లో ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. గుడ్విల్ అంబాసిడర్లకు వెల్కమ్ చెప్పేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. కొన్ని దశాబ్ధాల తర్వాత దేశంలో మళ్లీ ఆ పులి గాండ్రింపులు చేయబోనున్నట్లు చెప్పారు. చీతాలు అంతరించినట్లు 1952లోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే నమీబియా నుంచి తీసుకు వస్తున్న 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో వదలనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన మోదీ తన బర్త్డే సందర్భంగా ఆ చీతాలను అడవిలో రిలీజ్ చేయనున్నారు.