నాగర్కర్నూలు : లంచం తీసుకుంటూ ముగ్గురు వీఆర్వోలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని ముగ్గురు వీఆర్వోలు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. మాజీ సైనికుడికి భూమి ఇచ్చేందుకు వీరు లంచం డిమాండ్ చేశారు. భూమి ఇచ్చేందుకు వీఆర్వోలు బాలనారాయణ, బుచ్చిరాములు, చిన్నయ్య రూ.5 లక్షలు అడిగారు. దీంతో జవాను బాలరాజు ఏసీబీని ఆశ్రయించాడు. తెల్కపల్లి మండలం లక్కారం వద్ద వీఆర్వోలు డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.