నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద కారు బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టి ముగ్గురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అరవింద్ (23), పీఏపల్లి మండలం వద్దిపట్లకు చెందిన శిరీష (20), మహబూబాబాద్ జిల్లా గొల్లచర్లకు చెందిన కిరణ్మయి (22), మిర్యాలగూడ మండలం గూడూరుకు చెం దిన రేణుక.. హైదరాబాద్లో ఉంటూ చదువుకొంటున్నారు. గురువారం సాయంత్రం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలో జరిగిన స్నేహితుడి వివాహానికి వీరంతా కారులో వచ్చారు. అర్ధరాత్రి తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా మార్చాల శివారులో కారు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలిలోనే అరవింద్, శిరీష, కిరణ్మయి మృతిచెందగా, రేణుకకు తీవ్రగాయాలయ్యాయి.
– కల్వకుర్తి రూరల్