హైదరాబాద్ సిటీబ్యూరో/కీసర, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఒక్కరోజులో 450 కి.మీ.లు ప్రయాణించారు. 9 గంటలపాటు డ్రైవింగ్ చేయ డంతో కారు డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లాడు. రెప్ప పాటులో అతివేగంగా ఔటర్ రిండ్రోడ్డుపై నాలు గు లేన్లు దాటి ఆగిఉన్న టిప్పర్ను ఢీకొట్టాడు. దీం తో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రిస్క్తో చేసిన ప్రయత్నం మూడు కుటుంబాల్లో విషాదా న్ని నింపింది. బుధవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అల్వాల్కు చెందిన సుమంత్రెడ్డి(21).. పెద్దమ్మ కొడుకు పవన్కుమార్రెడ్డి (21), డ్రైవర్ శంకర్రెడ్డి(38)తో కలిసి తన సోదరుడిని ఖమ్మంలోని హాస్టల్లో వదిలేందుకు బుధవారం తెల్లవారుజామున కారులో బయలుదేరారు. అతన్ని అక్కడ వదిలేసి తిరిగివస్తుండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కీసర రింగ్రోడ్డు టోల్ప్లాజాకు 2 కిలోమీటర్ల దూరంలో ఆగిఉన్న టిప్పర్ను కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ శంకర్రెడ్డి, పక్కన కూర్చున్న సుమంత్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో ఉన్న పవన్కుమార్రెడ్డి, టిప్పర్ పక్కన నిలబడి ఉన్న క్లీనర్లు మదన్, వెంకట్కు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకొన్న కీసర సీఐ జే నరేందర్గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఈసీఐఎల్లోని ఓ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ పవన్కుమార్రెడ్డి మృతిచెందిన్నట్టు సీఐ తెలిపారు.
ప్రమాదసమయంలో కారు 100 కి.మీ. వేగంతో వెళ్తున్నదని, డ్రైవర్ నిద్రలోకిజారుకోవడంతో రహదారిపై మొదటి లేన్ నుంచి నాలు గో లేన్నుదాటి మరమ్మతుల కోసం ఆగిఉన్న టి ప్పర్ను ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమంత్రెడ్డి కర్ణాటకలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది.