మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు సార్లు అఖండ మెజార్టీతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జాతీయ స్థాయి పార్టీ, దేశాన్ని పాలిస్తున్న పార్టీకి అధ్యక్షుడైన వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటంపై టీఆర్ఎస్ నేతలే కాకుండా ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నడ్డా మాటలపై జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొంటున్నారు. నడ్డా సైతం బండి సంజయ్తో సమానంగా మారిపోయారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై బీజేపీ నేతలు అనవసర మాటలు మాట్లాడుతున్నారని మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు..
మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకే బీజేపీ అడ్డదారులు తొ క్కుతున్నది. కొత్తగా ఏర్పడిన పసిగుడ్డు లాంటి తెలంగాణ రాష్ర్టానికి అండగా ఉం డాల్సింది పోయి నిత్యం కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. తెలంగాణ స్వయం సమృద్ధి సాధించి ముందుకు దూసుకుపోవడం ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం రుచించడం లేదు. అందుకే నడ్డా అబద్ధాలను వల్లె వేస్తున్నారు. కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ సభ్యులు వచ్చి తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకుంటుంటే నడ్డాకు మాత్రం అవినీతి గుర్తుకువస్తున్నది. ఇది ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి ఉదాహరణగా ని లుస్తున్నది. కల్లాల్లో ఉన్న వడ్ల నుంచి మొదలుపెడితే, కంటోన్మెంట్ రోడ్ల దాకా అం తా బీజేపీ కిరికిరే చేస్తున్నది. యూపీలో బీజేపీ అభివృద్ధి పేరిట ఓట్లను అడగడం లేదు.. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లను పొందాలని ప్రయత్నిస్తున్నది. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇంతటి దారుణమైన విమర్శలు చేస్తున్న నడ్డాకు, బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. – శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
సంస్కారం లేని నడ్డా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. దేశాన్ని పాలించేందుకు బీజేపీకీ అర్హత, దక్షత లేదు. బీజేపీ నాయకులకు పాలన పరిణతి లేదు. నడ్డా చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నాయకులకు సంస్కారం లేదని నిరూపించుకున్నారు. రాజనీతిజ్ఞత లోపించిన బీజేపీ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నది. ప్రజాస్వామ్యానికి చీడ పురుగుల్లా తయారయ్యారు. నడ్డా వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి చేయకుండా తిరోగమనంలోకి తెస్తున్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు. రాజకీయ లబ్ధి కోసం కుసంస్కారంగా వ్యవహరిస్తున్న బీజేపీ నాయకుల వ్యవహారశైలిని విజ్ఞులైన ప్రజలు పరిశీలించాలి. బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారుతున్నది.