హైదరాబాద్, జనవరి 1: ఒక్క రోజులోనే యూకేలో లక్షకుపైగా, అమెరికాలో 4లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్లోనూ గడిచిన రెండు వారాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ఒకవేళ యూకే తరహాలో మన దేశంలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి చెందితే రోజుకు 14 లక్షల కేసులు నమోదు కావొచ్చని ఇటీవల నీతిఆయోగ్ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న మూడు నెలల్లోపు కొవిడ్ మూడోవేవ్ వస్తుందని ప్రతి ముగ్గురిలో ఇద్దరు భారతీయులు విశ్వసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై సర్వే చేసిన లోకల్ సర్కిల్స్ సంస్థ వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని 87 శాతం మంది, పంచాయతీ కార్యాలయాలను ఐసొలేషన్ సెంటర్లుగా మార్చాలని 79 శాతం మంది, ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున పిల్లల ఆరోగ్య సంరక్షణ చర్యలకు నిధులు విడుదల చేయాలని 81 శాతం మంది అభిప్రాయపడ్డారు.
సర్వేలో అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇలా..