హైదరాబాద్: జూబ్లీహిల్స్ రేప్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ఇటీవల ఆన్లైన్లో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. జూబ్లీహిల్స్ ఘటన కేసులో రేపిస్టులను శరవేగంగా అరెస్టు చేశామన్నారు. ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపినట్లు మంత్రి తెలిపారు. అయితే 45 రోజుల తర్వాత హైకోర్టు ఆ రేపిస్టులకు బెయిల్ మంజూరీ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చట్టం ప్రకారం రేపిస్టులకు శిక్షపడే వరకు తమ ప్రభుత్వం పోరాడుతుందని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ రేప్ ఘటనను తన ట్విట్టర్లో ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. జువైనెల్ చట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్నట్లు వెల్లడించారు. అందుకే రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా పకడ్బందీ చట్టాన్ని తయారు చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు. రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి తుదిశ్వాస విడిచే వరకు జైలులో ఉండాలన్నారు. జీవిత ఖైదు శిక్షను నిజమైన రీతిలో అమలు చేయాలని మంత్రి తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు.
Loopholes in Juvenile Justice Act, IPC & CrPC have resulted in the rapists getting out on Bail in JH rape case
That’s the reason why I am demanding that these acts be amended so no Rapist gets a bail & when convicted remains in Jail till death
Life imprisonment in truest sense
— KTR (@KTRTRS) August 19, 2022
ఇక ఆగస్టు 15వ తేదీన గుజరాత్లో 11 మంది రేపిస్టులను విడుదల చేసిన అంశంపై స్పందిస్తూ.. ఇది దేశ అంతరాత్మకు ఓ మాయని మచ్చ అన్నారు. బానో రేప్ కేసులో రేపిస్టులకు పూలమాలలు వేసి, యుద్ధ వీరుల్లా, ఫ్రీడం ఫైటర్లలో సన్మానించడం శోచనీయమన్నారు. బిల్కిస్ బానోకు ఇవాళ ఏం జరిగిందో, రేపు మనలో ఒకరికి ఇలాంటి ఘటన జరిగే అవశాలు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు ఈ అంశంపై మేల్కోవాలని పిలుపునిచ్చారు.
This is a Blot on the Collective Conscience of our Nation
Rapists being garlanded & treated like war heroes or freedom fighters!!!
Remember, what happened to #BilkisBano today can happen to anyone of us tomorrow
Speak up India 🇮🇳 pic.twitter.com/KwvU4vufMe
— KTR (@KTRTRS) August 18, 2022