మహబూబ్నగర్ : భారత స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర. స్వాతంత్ర్యనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత దేశంలోనే తొలిసారిగా ‘హమారా తాండామే హమారా రాజ్’ అన్న నినాదాన్ని సాకారం చేస్తూ సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని మంత్రి తెలిపారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
జిల్లా కేంద్రంలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి 1000గజాలు కేటాయిస్తూ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో గిరిజన మహిళ హాస్టల్,గిరిజన భవన్,గిరిజన వసతి గృహం లాంటి ఎన్నో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.
పట్టణంలోని ప్రధాన కూడలిలో సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. గిరిజన సంక్షేమం కోసం అజన్మాంతం శ్రమిస్తానని మంత్రి హామీనిచ్చారు.