మహబూబ్నగర్, డిసెంబర్ 1 : ఓటరు జాబితా పక్కాగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా కలెక్టర్ వెంకట్రావుతో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన ఓటర్ల తొలగింపు, జాబితాలో తప్పుల సవరణ వంటి వాటిని పూర్తిచేసి వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. 2022 జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఓట రు జాబితా ప్రత్యేక సవరణ, ఓటు హక్కు, ఓటరు హెల్ప్లైన్ యాప్, గరుడ యాప్ స్వీ ప్ అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటర్లకు అవసరమైన సమాచారం ఎల్లప్పుడూ అం దుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఓట రు హెల్ప్లైన్, ప్రచార సామగ్రిని ఇప్పటికే జిల్లాకు పంపించామని తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ఈ వీఎం గోదాములను కొత్త కలెక్టరేట్ ఆవరణలో నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాన ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు.
ధరణి రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా చేపట్టాలి : కలెక్టర్
ధరణి రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తాసిల్దార్లతో ధరణి పోర్టల్పై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మిడ్జి ల్ మండలంలో ధరణి పోర్టల్ ద్వారా ఇటీవల మోసం చేసేందుకు యత్నించిన ఘటనను కలెక్టర్ ప్రస్తావించారు. తాసిల్దార్లు ధర ణి రిజిస్ట్రేషన్లపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధరణిలో మోసానికి పా ల్పడిన వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ధరణిలో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిచేయడంతోపాటు బాధ్యులపై అవసరమైతే పీడీయాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. మిడ్జిల్ ఘటనకు సంబంధించి మహబూబ్నగర్ ఆర్డీవో పద్మశ్రీని విచారణాధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం ధరణిలో పెం డింగ్ దరఖాస్తులపై మండలాలవారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు, ము టేషన్లు, సక్సేషన్లు, పీవోబీ కేసులు, కోర్టు కేసులు తదితర పెండింగ్ అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ తదితరులు ఉన్నారు.