బంట్వారం, నవంబర్ 25: హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే యేడాది నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలను నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి జీపీ లో ఒక నర్సరీని ఏర్పాటు చేసి, మొక్కల పెంపకాన్ని చేపట్టారు. బంట్వారం మండలంలోని 11 జీపీలలో 11 నర్సరీలు ఏర్పాటు చేశారు. బొపునారం, తొరుమామిడి, బస్వపూర్, బంట్వారం, రొంపల్లి, నాగ్వారం, సల్బత్తాపూర్, మద్వాపూర్, మాలసోమారం, యాచారం, సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీల వారీగా నర్సరీ పనులు ప్రారంభించారు. ఒక్కో సర్సరీలో 10 వేల నుంచి 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేయగా, పలు పంచాయతీల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. తొలుత మట్టిని ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపడం ప్రారంభించారు. మరో వారం రోజుల్లో విత్తనాలను నాటనున్నారు. మద్వాపూర్, మాలసోమారం, సుల్తాన్పూర్, నాగ్వారం జీపీల్లో 10 వేల మొక్కలను నాటేం దుకు ప్రణాళికను సిద్ధం చేయగా, బం ట్వారం, బస్వపూర్, యాచారం జీపీల్లో 15వేల మొక్కలు, తొరుమామిడి, సల్బత్తాపూర్, రొంపల్లి, బొపునారం జీపీల్లో 20 వేల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
పనులు ప్రారంభించాం: ఎంపీడీవో బాలయ్య
మండలంలో అన్ని జీపీల్లో నర్సరీలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే పలు జీపీ ల్లో పనులు ప్రారంభిం చాం. ప్రస్తు తం ఎర్రమట్టిని తెచ్చి బ్యాగ్ ఫిల్లింగ్ ప నులు చేస్తున్నారు. మొత్తం 1,65,000 మొక్కల పెంపకం చేపడు తాం.