తాడ్వాయి, ఫిబ్రవరి10 : మేడారంలో కొలువైన సమ్మక్క పుట్టిన ఊరు బయ్యక్కపేటలోని చందా వంశీయులు గురువారం అమ్మవారికి పుట్టింటి పట్టుచీరెను సమర్పించారు.
బయ్యక్కపేటలోని సమ్మక్క గుడిలో చందా వంశానికి చెందిన తలపతులు పర్మయ్య, రఘుపతిరావు, కృష్ణమూర్తి, గణేశ్, రవి, వెంకటేశ్వర్లు, నాగభూషణం, సోమేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, బత్కయ్య, కల్యాణ్కుమార్, పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చందా గోపాల్రావుతో కలిసి పుట్టింటి చీరెను సమ్మక్క దేవతకు సమర్పించారు.
పుట్టింటి చీరెను తీసుకుని డోలి వాయిద్యాల నడుమ మేడారంలోని తల్లి గద్దె వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పుట్టింటి నుంచి తల్లికి చెల్లించాల్సిన చీరె, ఒడిబియ్యం, పసుపు, కుంకుమలను చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని దశాబ్దాలుగా తల్లికి పుట్టింటి చీరెను సమర్పించిడం ఆనవాయితీగా వస్తున్నది.