హైదరాబాద్ : ఓ ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి(Thorn bushes) దూసుకెళ్లిన సంఘటన కామారెడ్డి(Kamareddy) జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు బాన్సువాడ నుంచి పిట్లం వస్తుండగా కుర్తిగేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.