జూబ్లీహిల్స్, జనవరి 4 : శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణలోనూ టీఎస్ఎస్పీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం టీఎస్ఎస్పీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ అభిలాషబిస్త్, అన్ని బెటాలియన్ల కమాండెంట్లతో డీజీపీ మహేందర్రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ మాట్లాడారు. కొవిడ్ సమయంలో టీఎస్ఎస్పీ సిబ్బంది రక్తదానం, ప్లాస్మా దానం చేశారని, వారి సేవలు ఎంతో కీలకంగా మారాయని కొనియాడారు.