కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 17 : ఎప్సెట్ – 2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు అఖండ విజయం సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 30 మంది విద్యార్థులను అభినందించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను కైవసం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.
పోగుల మానస 757, కటకం కౌశిక్ 876, తన్విత 996, సంగ అలేఖ్య 1070, బొమ్మిదేని శ్రీరాజ్ 1115, మెహజబీన్ 1415, షిఫా మహ్వీన్ 1479, వెంగళదాస్ గోపాలకృష్ణ 1691, గుండా అనుశ్రీ 1714, లాస్య చింతలపల్లి 1743, మ్యాకల అక్షయ 1803, అంబిలాపు శృతి 2270, హర్షిత వీ 2405, ముద్దం షైనీ 2746, ఉప్పుల శ్రీనిధి 2885, ఆర్ శివమణి 2934, జకుల శ్రీవైత్రి 3136, సబ్బని శ్రీజ 3236, దరి వంశీ 3285, చిన్నగొల్ల శృతి 3346, నల్లవెల్లి వశిష్ఠ్ 3480, పోగుల వైష్ణవి 3536, బొమ్మిదేని వైష్ణవి 3849, లకావత్ హిమానందిని 3998, అశ్విని జే 4461, కుంట హరిణి 4630, అభినందన 4705, కొత్త ప్రణవి 4835, సయీమా అంజుమ్ 4868, నిసా ఫాతిమా 4875 ర్యాంకులు సాధించారన్నారు.
ప్రత్యేక బోధనా విధానం, నిరంతర క్రమశిక్షణ, కఠినమైన శిక్షణకు సజీవ నిదర్శనం ఈ విజయమని స్పష్టం చేశారు. ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తాము ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా గుర్తిస్తామని చెప్పారు. కాన్సెప్ట్ ఆధారిత బోధన, రెగ్యులర్ అనలిటికల్ టెస్టులు, వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించడం వల్లే ఈ ర్యాంకుల పట్టికలో ట్రినిటీ పేరు మార్మోగుతున్నదన్నారు. ఇక్కడ ట్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్ దాసరి మమతరెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.