సుల్తానాబాద్ రూరల్, మార్చి 27: కేంద్రం వడ్లను కొనేదాకా రైతాంగం సమష్టిగా ఉద్యమించాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు పిలుపునిచ్చారు. మండలంలోని నారాయణపూర్లో చిన్నకల్వల వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోదాంను ఆదివారం ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై ప్రారంభించారు. చిన్నకల్వల విండో చైర్మన్ దేవరనేని మోహన్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మాట మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పంజాబ్లో గోధుమలను ఎందుకు కొంటున్నారని, అక్కడ కూడా పిండి చేస్తేనే కొంటామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఒక్క నాయకుడు మాట్లాడడం లేదని ఆరోపించారు. వరి ధాన్యం కొనకుంటే కరీంనగర్లోని బండి సంజయ్ ఇంటి వద్దనే ధాన్యం పోస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం అన్ని గ్రామాల్లో ప్రభుత్వం గోదాంలను నిర్మిస్తున్నదన్నారు. చైర్మన్ మోహన్రావు, పాలకవర్గం సమష్టి కృషితో దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని సంఘాల పరిధిలో కేంద్రం ధాన్యం కొనాలని తీర్మానాలను చేయించాలని కొండూరి రవీందర్రావుకు సూచించారు. కొండూరి మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే చిన్నకల్వల, సుల్తానాబాద్ సంఘాలు అభివృద్ధి దూసుకుపోతున్నాయన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చి సుల్తానాబాద్, చొప్పదండి, పలు సంఘాల అభివృద్ధిని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దశల వారీగా సంఘాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రవీందర్రావును సర్పంచ్ స్వరూప, ఉప సర్పంచ్ రామారావు, నాయకులు, సంఘం చైర్మన్లు గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్గౌడ్, విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, జూపల్లి సందీప్రావు, మహిపాల్రెడ్డి, సర్పంచు లు మూల స్వరూప, కోమలత, స్వప్న, సాగర్రా వు, ఎంపీటీసీలు సంపత్, ఫకీర్యాదవ్, రమేశ్, ఏఏంసీ వైస్ చైర్మన్ మహిపాల్రెడ్డి, విండో వైస్ చైర్మన్ రాజు, సీఈవో రమేశ్, ఉప సర్పంచ్ రా మారావు, తదితరులు ఉన్నారు.