ముంబై,జూలై:కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఇటీవల వన్ప్లస్ నుంచి వచ్చిన మోడల్స్ హిట్ కావడంతో “వన్ ప్లస్ నార్డ్ -2 ” పేరుతో అప్డేటెడ్ వర్షన్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ జూలై చివరి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆన్లైన్లో లీకయ్యాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనున్నాయి.
మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ఉంది. 6.43 అంగుళాల, హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్, ల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్గా ఉండనుంది. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తున్నది.