కాసిపేట, డిసెంబర్ 14 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కౌంటింగ్పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఎన్నికల పోలింగ్ తో పాటు కౌంటింగ్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ యధావిధిగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో హై కోర్టు తీర్పు మేరకు రిజర్వేషన్ పై నిర్ణయం ఉంటుందని, కాని ఇప్పుడు యధావిధిగా ఎన్నికలు నిర్వహణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ యధావిధిగా జరగనుండగా కౌంటింగ్ మాత్రం నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారని ముందుగా అధికారులు తెలిపారు. కానీ, కాని దీనిపై స్పష్టమైన విధానంపై ఉత్తర్వలు అందినట్లు వారు తెలిపారు.
ఎన్నికల విధానం ఆగదని, యధావిధిగా ఉంటుందని తెలిపారు. మల్కెపల్లి షెడ్యూల్ ఏరియాపై పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించగా వాదనలు కొనసాగుతూ వచ్చాయి. రెవెన్యూ రికార్డులు విరుద్ధంగా నాన్ షెడ్యూల్ ఏరియాగా ఉన్న మల్కెపల్లి గ్రామాన్ని అధికారులు షెడ్యూల్ ఏరియాగా కొనసాగిండం అన్యాయమని, దీనిపై చర్యలు తీసుకొని మల్కెపల్లి గ్రామ పంచాయతీని నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలని కోరుతూ గ్రామానికి చెందిన కసాడి శ్రీనివాస్, పలువురు గ్రామస్తులు హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాన్ షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి అన్ని ఆధారాలు సమర్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కోర్టు తీర్పు అనుగుణంగా నిర్ణయం ఉండనుంది.