సూర్యాపేట : జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో తెలంగాణలో తొలి సూర్య క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ దేవస్థానంలో.. రథసప్తమి సందర్భంగా మంత్రి జగదీష్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్-కమల దంపతుల కుమారులు గాదరి మహిత్, గాదరి నిమిత్ పేర్లతో రూ.6,00,000 (ఆరు లక్షల రూపాయల) వ్యయంతో ఏర్పాటు చేసిన శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.