జేరుసలేం,జూన్ 28: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విటమిన్-“డీ”కి సంబంధం ఉందనడానికి మరోసారి ఆధారం లభించింది. ఇజ్రాయెల్ నిపుణుల తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. విటమిన్ “డీ “అధికంగా ఉన్నవారు కరోనాతో పోరాడే సామర్థ్యం అధికంగా కలిగి ఉంటారు. కరోనా సోకిన వారిలోనూ విటమిన్”డీ ” మోతాదు తక్కువగా ఉన్నవారే అధికంగా చనిపోయారని మెడ్ ఆర్చివ్ అధ్యయనంలో తేలింది.
కోవిడ్19 సోకక ముందు విటమిన్ “డీ ” 20 ng/mL ఉన్నవారిలో 26 శాతం కరోనా మరణాలు సంభవించాయని,ఈ విటమిన్ అధికంగా ఉన్నవారిలో కేవలం 3 శాతం మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్ నహారియాలోని గెలిలీ మెడికల్ సెంటర్లోని ఎండోక్రినాలజీ అండ్ డయాబెటిస్ యూనిట్ డైరెక్టర్ అమిర్ బాస్కిన్ అధ్యయనంలో తేలింది.
అంటే విటమిన్ “డీ ” తక్కువగా ఉన్నవారిలోనే కరోనా మరణాలు 20 శాతం అధికంగా సంభవించాయి. ఇజ్రాయెల్ నహారియాలోని గెలిలీ మెడికల్ సెంటర్లోని ఎండోక్రినాలజీ అండ్ డయాబెటిస్ యూనిట్ డైరెక్టర్ అమిర్ బాస్కిన్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రతిరోజూ మనకు 1200 మిల్లీగ్రాముల విటమిన్”డీ ” అవసరమని, తక్కువగా ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు సూచనలు తీసుకోవాలని సూచించారు. అబ్రియోలి ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ బార్ ఇలాన్ యూనివర్సిటీ సైతం కొన్ని విషయాలు గుర్తించింది.