న్యూఢిల్లీ, నవంబర్ 28: ఈపీఎఫ్, పెన్షన్, ఐటీ రిటర్న్స్, ఎల్పీజీ… ఇలా అనేక అంశాలకు సంబంధించి బుధవారం (డిసెంబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
అవేంటంటే..
ఈపీఎఫ్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నంబర్కు (యూఏఎన్) ఆధార్ నంబర్ను లింక్ చేయాలి. ఆఖరు తేదీ నవంబర్ 30. అప్పట్లోగా యూఏఎన్ను ఆధార్ నంబర్తో లింక్ చేయకపోతే ఈపీఎఫ్ అకౌంట్లో యజమాని వాటా జమ కాదు.
పెన్షన్: నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ (జీవన ప్రమాణ పత్రం-పెన్షనర్ జీవించి ఉన్నాడన్న ధ్రువపత్రం) సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్ పొందాలంటే గడువులోగా బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి.
ఐటీ రిటర్న్స్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయాల్సినవారికి వచ్చే నెల 31 వరకే గడువు ఉంది. నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఫైలింగ్లో పొరపాట్లు లేకుండా ఉండాలంటే నెల ముందునుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆలస్య రుసుం వసూలు చేస్తారు.
ఎల్పీజీ: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నట్టు సమాచారం. నవంబర్లో వాణిజ్య సిలిండర్ ధరను రూ.266 పెం చాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాం టి మార్పు చేయలేదు. అయితే, ఈసారి వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉం డొచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు.
సౌదీఅరేబియా: భారత్తో పాటు మరో ఐదు దేశాలపై సౌదీ అరేబియా ఇటీవల ట్రావెల్ బ్యాన్ ఎత్తేసింది. డిసెంబర్ 1 నుంచి ఇది అమలుల్లోకి రానున్నది. సౌదీకి వెళ్లే వేలాదిమంది భారతీయ కార్మికులకు ఇది ఊరటనిచ్చే విషయం.