Punjab National Bank | సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సదవకాశం కల్పించింది. అదనంగా 50 బేసిక్ పాయింట్ల వడ్డీ అందిస్తున్నట్లు తెలిపింది. సురక్షితమైన, ఆకర్షణీయ పెట్టుబడి మార్గాలుగా ఫిక్స్డ్ డిపాజిట్లను పరిగణించే వారికి ఇది శుభవార్తే. ఈ నెల 13 నుంచే ఈ అదనపు వడ్డీరేట్ పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
60-80 ఏండ్ల మధ్య వయస్సు గల సీనియర్ సిటిజన్లకు ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనపు 50 బేసిక్ పాయింట్లు వడ్డీ అందిస్తున్నది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఐదేండ్ల కంటే ఎక్కువ గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 80 బేసిక్ పాయింట్ల వడ్డీ పొందుతారు.
సీనియర్ సిటిజన్లు 6.60 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లు 6.90 శాతం వడ్డీ రేట్లు అందుకుంటారు. పీఎన్బీ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద ఉద్యోగులతోపాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు 100 బేసిక్ పాయింట్లు అదనపు వడ్డీ రేటు అందుతుంది.