తిరుమల : తిరుమల (Tirumala ) లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.5.21 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers ) వెల్లడించారు. నిన్న స్వామివారిని 68,601 మంది భక్తులు దర్శించుకోగా 23,396 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టడంతో కంపార్ట్మెంట్ల ( Compartments ) గుండా కాకుండా నేరుగా క్యూలైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.
ఆగస్టు 18, 19వ తేదీల్లో కరెన్సీ కట్ నోట్స్ ఈ-వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 31 దేశాలకు చెందిన 24,583 చిరిగిన కరెన్సీ నోట్ల ( Currency Notes ) ను ఆగస్టు 18,19వ తేదీల్లో ఈ – వేలం వేయనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించాలని సూచించారు.