సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ ) : నూతన సంవత్సరం పురస్కరించుకొని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, హైదరాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ క్యాలెండర్ను మేయర్కు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్లు పంకజ, రవికిరణ్, వైద్యాధికారి డా.భార్గవ్ నారాయణ్, టీజీవో హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ రాజ్కుమార్, జె.నర్సింగ్రావు, గోపీచంద్, ఖాదర్ పాల్గొన్నారు.