మహబూబ్నగర్ : దళితులను ధనవంతులుగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దళితబంధు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. విడతల వారీగా ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దళితుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా దళితబంధును పక్కాగా అమలు చేస్తామన్నారు.