కడ్తాల్, నవంబర్ 24 : రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. వరి ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు రవీందర్రెడ్డి, తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్లు రామకృష్ణ, పాండునాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సత్యం, డైరెక్టర్లు వెంకట్యాదవ్, సేవ్యానాయక్, వెంకటేశ్, రమేశ్, దేవేందర్, పద్మాకర్, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, వార్డు సభ్యులు, నాయకులు చందోజీ, వెంకటేశ్, రాజు, లక్పతినాయక్, మహేశ్, ఏవో శ్రీలత పాల్గొన్నారు.
తలకొండపల్లి మండలంలో 4 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తలకొండపల్లి నవంబర్ 24 : ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి అన్నారు. బుధవారం తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి, రాంపూర్, వెల్జాల్, తలకొండపల్లి గ్రామాల్లో రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. రైతులకు కావాల్సిన సంచులు, లారీలు సమకూర్చి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ధాన్యంలో తేమలేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రెహ్మాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, సర్పంచ్లు రమేశ్, జయమ్మ, లలిత, కిష్టమ్మ, సింగిల్ విండో వైస్ చైర్మన్ రవికుమార్, డైరెక్టర్లు శిరీష, నయీం, శేఖర్, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, హరిమోహన్రెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు షురూ
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 24 : మండల పరిధిలోని పోల్కంపల్లి సహకార సంఘం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ధాన్యం తీసుకువస్తున్నారు. బుధవారం పోల్కంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు.