మేడ్చల్, నవంబర్ 30 : చిన్న తనం నుంచి కష్టపడి చదివినప్పుడే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్లార్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వసతులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా మారాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్లార్ విద్యా సంస్థల కార్యదర్శి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, మున్సిపల్ చైర్మన దీపికానర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.