భూత్పూర్, డిసెంబర్ 5 : రైతులు ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. మున్సిపాలిటీలోని శేరిపల్లిలో ఆదివారం కలెక్టర్ రైతులతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో యా సంగిలో వడ్లు కొనుగోలు చేయమని ప్రభుత్వం స్పష్టం చే సిందన్నారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు, చిరు ధా న్యాలను పండించాలని రైతులకు సూచించారు. వానకాలం, యాసంగిలో వరిసాగుతో భూములు సారం కోల్పోతాయని, రైతులు పంటమార్పిడి పద్ధతి పాటించాలని సూచించారు. ప్రభుత్వ విధి విధానాలకు అనుకూలంగా రైతులు వ్యవహరిస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో ఆయిల్పాం సాగుకు భూములు అనుకూలంగా ఉ న్నాయని, రైతులు ఆయిల్పాం సాగు చేసేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కమిషనర్ నూరుల్నజీబ్, ఏవో మురళీధర్, డిప్యూటీ తాసిల్దార్ రాజీవ్రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, ఏఈవో హర్షవర్ధన్, మాజీ ఎంపీపీ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.