న్యూఢిల్లీ, నవంబర్ 25: హై క్వాలిటీ 5జీ కమ్యూనికేషన్ను వినియోగదారులకు అందించేక్రమంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో..తన హైదరాబాద్లో ఉన్న 5జీ ల్యాబ్ నుంచి తొలి వీవోఎన్ఆర్ (వాయిస్/వీడియో ఆన్ న్యూ రేడియో) కాల్ను నిర్వహించింది. రెనో6 సిరీస్ స్మార్ట్ఫోన్తో ఈ 5జీ కాల్స్ చేసినట్లు ఒప్పో తెలిపింది. తమ హైదరాబాద్ 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్లో కీసైట్ టెక్నాలజీస్ అమర్చిన 5జీ స్టాండలోన్ నెట్వర్క్ను ఇందుకు ఉపయోగించినట్లు ఒప్పో పేర్కొంది. వీవోఎన్ఆర్ కాల్స్తో సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ బాగుంటుందని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ అరీఫ్ చెప్పారు.