సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వైకుంఠధామాలు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా, మరికొన్ని నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఇందులో భాగంగా కాప్రా సరిల్ మల్లాపూర్లో సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో నిర్మించిన ఆధునిక వైకుంఠధామం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ప్రకటించారు.
మహానగరంలో మొదటి దశలో రూ. 24.13 కోట్ల వ్యయంతో 24 మోడల్ శ్మశానవాటికల నిర్మాణం చేపట్టి.. పూర్తి చేశారు. రెండో దశలో రూ. 25.02 కోట్ల అంచనా వ్యయంతో 10 మోడల్ వైకుంఠధామాలను చేపట్టగా, అందులో రూ. 11 .08 కోట్ల వ్యయంతో 5 మోడల్ గ్రేవ్ యార్డ్లు పూర్తయ్యాయి. మిగతా ఐదు నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి.
మల్లాపూర్ పాత శ్మశానవాటికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు సమకూర్చారు. గతంలో ఉన్న సమాధులు కనిపించకుండా.. చుట్టూ మొకలు నాటారు. కట్టెలతో కాల్చేందుకు వేర్వేరుగా మూడు చితిలు, మూడు వెయిటింగ్ రూంలతో పాటు దుస్తులు మార్చుకునే గదులను నిర్మించారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్లు కట్టించారు. తాగునీటి వసతి, ఖాళీ స్థలంలో ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ చేపట్టారు. శివుడు, యోగా ముద్రలో తపస్సు చేస్తున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. చుట్టూ వాటర్ ఫౌంటెన్ నిర్మించారు. ప్రత్యేకంగా ఆఫీస్ రూమ్, బూడిద నిల్వ సౌకర్యం, కేశఖండన రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కాప్రా సరిల్ లో 23 కాలనీల్లో వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దహన సంసారాల నిర్వహణకు వస్తారని అధికారులు తెలిపారు.