ముంబై, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, మానసిక వైకల్యంతో ఉన్న కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ముంబైలో ఈ దారుణం జరిగింది. పోలీసులు 17 మంది డీఎన్ఏను పరీక్షించగా ఈ విషయం తెలిసింది. బాధితురాలిపై లైంగిక దాడి నిరుడు మేలో జరిగిందని పోలీసులు వెల్లడించారు.
యువతికి అసౌకర్యంగా ఉండటంతో ఆమెను దవాఖానలో చేర్పించగా, గర్భవతి అని తేలింది. గర్భ ధారణకు గల కారణాన్ని ఆమె చెప్పకపోవడంతో ఆమె తండ్రితో పాటు చుట్టుపకల ఉండేవారు, బంధువులతో కలిపి మొత్తం 17 మంది డీఎన్ఏని పోలీసులు పరిశీలించారు. చివరకు ఆమె తండ్రే నిందితుడని తేలింది.