కొత్తగూడెం ప్రగతి మైదాన్: మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. అందులో 8 మంది మహిళా సభ్యులు ఉన్నారని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
లొంగిపోయిన వారిలో డివిజినల్ కమిటీ సభ్యుడు సోమడు మడకం, పార్టీ సభ్యులు హుంగి కుంజం, పాయకి కుంజం ఉన్నట్లు వివరించారు. 12 మందిపై మొత్తం రూ.46 లక్షల రివార్డులు ఉన్నట్లు వెల్లడించారు.