సందీప్రెడ్డి వంగా.. ఈ పేరే ఓ సంచలనం. తొలి సినిమా ‘అర్జున్రెడ్డి’తో దేశమంతా తనవైపు చూసేలా చేసిన దర్శకుడాయన. మలి కథ ‘యానిమల్’తో పానిండియా స్థాయిలో సందీప్ సృష్టించిన సన్సేషన్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’ చేస్తూ బిజీగా ఉన్నారు సందీప్. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. ఇదిలావుంటే.. సందీప్రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా త్వరలో జపాన్లో విడుదల కానున్నది. ప్రమోషన్స్లో భాగంగా హీరో రణబీర్కపూర్తో కలిసి ఇటీవలే ఆయన జపాన్ వెళ్లారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘యానిమల్’ సీక్వెల్గా రానున్న ‘యానిమల్ పార్క్’ గురించి ఆసక్తికరమైన విషయాలను సందీప్రెడ్డి వెల్లడించారు. ‘ ‘యానిమల్’తో పోలిస్తే మరింత బోల్డ్గా, మరింత వైల్డ్గా ‘యానిమల్ పార్క్’ ఉండబోతున్నది. ఇందులోని పాత్రల పోకడలైతే ఊహలకు అతీతంగా ఉంటాయి. 2027లో షూటింగ్ మొదలుపెట్టి, 2028లో విడుదల చేస్తా. ప్రస్తుతం ‘స్పిరిట్’ చేస్తున్నా. ఆ సినిమా పూర్తిచేసి ‘యానిమల్ పార్క్’ మొదలపెడతా.’ అంటూ చెప్పుకొచ్చారు సందీప్రెడ్డి వంగా.