న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశీయ పారిశ్రామిక రంగం తిరిగి పుంజుకుంటున్నది. జూలై నెలకుగాను పారిశ్రామిక రంగంలో 5.7 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర గణాంకాల శాఖ మంగళవారం వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 2.2 శాతంతో పోలిస్తే భారీగా పెరగగా..కానీ, జూన్లో నమోదైన దాంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.
గత నెలకుగాను గనుల రంగంలో 10.7 శాతం వృద్ధిని కనబరుచగా..విద్యుత్ రంగం ఎనిమిది శాతం వృద్ధిని కనబరిచాయి. ఏప్రిల్-జూలై మధ్యకాలంలో పారిశ్రామిక రంగం 4.8 శాతం వృద్ధిని కనబరిచాయి.