రామారెడ్డి : భార్య భర్తల గొడవలు ఆ చిన్నారిని అనాథను చేశాయి. మనస్పర్థలతో చావే శరణ్యమని భావించిన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారంరాత్రి చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నామాల శంకర్(40) అతని భార్య సుజాత (35) ఇద్దరు వారి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. వీరికి 6 సంవత్సరాల కుమారుడు ప్రేమ్ కుమార్ ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.