రామంతాపూర్/ఉప్పల్, నవంబర్ 12: ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాపార్కువద్ద చేపట్టిన ధర్నాకు ఉప్పల్, చిలుకానగర్, నాచారం, రామంతాపూర్, హబ్సీగూడ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సారధ్యంలో శుక్రవారం భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పడూ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బన్నాల గీతా ప్రవీణ్, శాంతి సాయిజెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు, గడ్డం రవికుమార్, డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీచారి, ఎండీ.ముస్తాక్, బచ్చన్నగౌడ్, గరిక సుధాకర్, రాజశేఖర్, తిప్పని సంపత్కుమార్, కుమారస్వామి, కృష్ణారెడ్డి, శివ, నజీర్, విబి.నర్సింహ, ఏదుల కొండల్రెడ్డి, మహేందర్, రాంచందర్, సుధాకర్, యాదగిరి, పాల్గొన్నారు.
కాప్రా, మల్లాపూర్, మీర్పేట్ డివిజన్ల నుంచి..
మల్లాపూర్, నవంబర్ 12: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో కాప్రా, మల్లాపూర్, మీర్పేట్ హెచ్బీకాలనీ, డివిజన్ల కార్పొరేటర్లు తరలివెళ్లారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వర్ణరాజు, పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, మల్లాపూర్, మీర్పేట్, కాప్రా డివిజన్ల అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, సుడుగు మహేంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్, గణేశ్, రాయ్, కుమార్, నవీణ్గౌడ్, సాయి ముదిరాజ్, నరహరి, యాదగిరి, రామకృష్ణ, కుంటి కృష్ణ, బూరుగు మారుతీరావు, కృష్ణవేణి, కోటేశ్వరి, అండాలు, గిరుకబావి సురేఖ పాల్గొన్నారు.
ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్ నాయకులు
చర్లపల్లి, నవంబర్ 12: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్ల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు డప్పు గిరిబాబు, బేతాల బాల్రాజు, నాయకులు రాంచందర్గౌడ్, శేర్ మణెమ్మ, సుదర్శన్రెడ్డి, రెడ్డినాయక్, నాగిళ్ల బాల్రెడ్డి, పాండాల శివకుమార్గౌడ్, నాగేశ్వర్రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, కొమ్ము రమేశ్, శోభారెడ్డి, బత్తుల శ్రీకాంత్యాదవ్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, సయ్యద్ అలీ, మురళి, మహిపాల్రెడ్డి, ధనుంజయ్యగౌడ్, సతీష్గౌడ్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.