న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని, ప్రయాణ సమయం చాలా పెరిగిందని రైల్వే వ్యవస్థపై కాగ్ మొట్టికాయలు వేసింది. రైళ్ల సమయపాలన కూడా చాలా తగ్గిందని పేర్కొంది. గురువారం పార్లమెంటులో కాగ్ వార్షిక నివేదిక ప్రవేశపెట్టింది. ఎక్స్ప్రెస్ రైళ్ల సమయపాలన దాదాపు 79 శాతం నుంచి 69 శాతానికి తగ్గిందని తెలిపింది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా వర్గీకరించడం సరికాదని ఆక్షేపించింది.