షాహ్ ఆలమ్ (మలేషియా): సీనియర్ల గైర్హాజరీలో భారత యువ బ్యాడ్మింటన్ బృందం.. ఆసియా టీమ్ చాంపియన్షిప్నకు రెడీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ పురుషుల జట్టుకు లక్ష్యసేన్.. మహిళల టీమ్కు మాళవిక భన్సోద్ సారథ్యం వహిస్తున్నారు. టోర్నీ తొలి రోజు పురుషుల గ్రూప్-‘ఎ’లో కొరియాతో భారత్ తలపడనుంది. మహిళల విభాగంలో గ్రూప్-‘బి’లో ఉన్న మన జట్టు.. మొదటి పోరులో ఆతిథ్య మలేషియాను ఢీ కొట్టనుంది. ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. అతడి ప్రదర్శనపైనే జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. పురుషుల జట్టులో సేన్తో పాటు కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథన్, రఘు మరిస్వామి సింగిల్స్ బరిలో ఉన్నారు.