రాజన్న సిరిసిల్ల : సీఎం కేసీఆర్ చొరవతోనే తండాలు నేడు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని రుద్రంగి మండలం మానాల గిరిజన తండాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఉద్యమ సమయంలో మానాలలో తిరిగినప్పుడు ఇక్కడి ప్రజల బాధలు చూశాను.
సీఎం కేసీఆర్ సహకారంతో గిరిజన తండాల్లో ప్రభుత్వ దవాఖాన, గురుకుల పాఠశాల, సిసి రోడ్లు వంటి అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని మత్రి తెలిపారు. గిరిజన తండాల్లో దాదాపు 90 శాతం పనులు పూర్తి అయ్యాయి. మానాల గిరిజన ప్రజల చిరకాల స్వప్నం అయినా మానాల-మరిమడ్ల రోడ్డుకు మంత్రి కేటీఆర్ సహకారంతో పనులకు ప్రారంభోత్సవం చేసుకున్నామని తెలిపారు.
రుద్రంగి నుండి దేవక్క పేటకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభోత్సవం తీసుకుంటామన్నారు. రూ.5 కోట్లతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పనులు జరుగుతున్నాయని వివరాలను వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. నేను ఎప్పటికీ మీ బిడ్డను మీరు నాపై చూస్తున్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలన్నారు.