నల్లగొండ : అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు పట్టణాలతో సరి సమానంగా పోటీ పడుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా యావత్ భారతదేశంలోనే తెలంగాణ పల్లెలు నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నాయన్నారు. శుక్రవారం జరిగిన నల్లగొండ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు.
కరోనా సమయంలోనూ అభివృద్ధి,సంక్షేమం కార్యక్రమాలకు అవరోధం లేకుండా పరుగులు పెట్టించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఆర్థిక పరిపుష్టిలోనూ తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.
దేశ సగటు ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదయమే ఎక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు కోటిరెడ్డి,అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు యన్.భాస్కర్ రావు,రవీంద్ర నాయక్,నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు.