హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి చేర్చవద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం కోరింది. సంఘం ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు శుక్రవారం విద్యుత్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మను కలిసి వినతిపత్రం అందించారు. ముఖ్యంగా శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం, అందులోని ఉద్యోగులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవద్దని విన్నవించారు. పంపింగ్ మోడ్లో పనిచేసే సామర్థ్యం ఉన్న తెలంగాణలోని విద్యుత్తు కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే తెలంగాణతోపాటు దక్షిణాది గ్రిడ్పై ప్రభావం పడుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు.