హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ పాలిసెట్ (Polycet) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ సహా ఇతర ఉన్నతాధికారులు నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నారు. పాలిసెట్ను జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 1,04,432 మంది (91.62 శాతం) విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.