మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. ప్రజాదండు కవాతు జాతీయ స్ఫూర్తిని నింపింది.. జాతీయ సమైక్యతా నినాదం నలుదిశలా మార్మోగింది.. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రదర్శనలు జరిగాయి.. ఖమ్మం ర్యాలీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రాత్మకమన్నారు. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదని పేర్కొన్నారు.
మధిరలో నిర్వహించిన ర్యాలీకి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతి నిధులు, అధికారులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ జిల్లాల్లోని పది నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం ర్యాలీలో మంత్రి అజయ్కుమార్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల, అదనపు కలెక్టర్లు మధుసూదన్, స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, మధిర ర్యాలీలో ఎంపీలు నామా, వద్దిరాజు రవిచంద్ర, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కూసుమంచి ర్యాలీలోపాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ప్రదర్శనలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మణుగూరు ర్యాలీలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం ర్యాలీలో ఎమ్మెల్యే వనమా, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఇల్లెందు ర్యాలీలో ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, భద్రాచలం ర్యాలీలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అశ్వారావుపేటలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.