ముషీరాబాద్, అక్టోబర్ 23: అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ప్రజలతో మమేకమై పనిచేసే మంత్రి హరీశ్రావును విమర్శిస్తే ఖబడ్దార్ అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. హరీశ్రావుపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే అరవింద్కు తగిన బుద్ధిచెప్తామని పేర్కొన్నారు. పసుపు బోర్డు తీసుకొస్తానని గత ఎన్నికల్లో గెలిచి, ముఖం చాటేసిన అరవింద్కు మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి లేదని అన్నారు. శనివారం విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత, మహిళ, ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. మాదిగలను నిలువునా మోసం చేసిన పార్టీలో ఉండి నీల్గుతున్న అరవింద్.. చేతనైతే పసుపుబోర్డు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు దళితులను బానిసలుగా చూసే సంస్కృతిని వీడి సీఎం కేసీఆర్ మాదిరిగా దళితుల కోసం పథకాలు తీసుకురావాలని హితవుపలికారు.