Chandrayaan-3 | ఉండవెల్లి, ఆగస్టు 22 : భారతదేశం ఎంతో గర్వించదగ చంద్రయాన్-3లో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామవాసి పని చేస్తున్నారు. ఉండవెల్లికి చెందిన కుమ్మరి మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు కృష్ణ 2018లో ఐసీఆర్బీ నిర్వహించిన పరీక్షలలో 4వ ర్యాంక్ సాధించి బెంగళూర్లో ఇస్రో లివోస్ విభాగంలో గ్రూప్-ఏ గెజిటేడ్ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు. కృష్ణ (సాఫ్ట్ట్వేర్ సైంటిస్ట్ ఎస్డీ) చంద్రయాన్-3 మిషన్లో 2 పెలోడ్స్ (ఎల్ఎచ్వీసీ), (ఐఎల్ఎస్ఏ)కు డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ సాఫ్ట్వేర్తో చంద్రుడిపై వచ్చే భూకంపాలు కెమోరాలో రికార్డు చేయడంతోపాటు పెలోడ్స్ నుంచి వచ్చే డేటాను (ఐఎస్ఆర్ఏపీ బెంగళూర్) గ్రౌండ్ స్టేషన్ రిసీవ్ చేసుకునేలా రూపకల్పన చేసినట్లు వివరించాడు. కృష్ణ తల్లిదండ్రులు రోజు వారి కూలీలు. ఉండవెల్లి ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్ వరకు, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ డిప్లొమా, హైదరాబాద్ వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో విద్య పూర్తి చేసి తర్వాత ఇస్రోలో ఉద్యోగం సాధించాడు.