హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): గడ్డిఅన్నారం కూరగాయల మారెట్ను బాటసింగారం తరలించి, అ ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ప్రజారోగ్యం కోసం ఉన్నత ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్యసేవలు అందజేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఆటంకాలు కల్పించటం సబబుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 18 నాటికి గడ్డిఅన్నారం మారెట్ను ఖాళీ చేసి, బాటసింగారం తరలివెళ్లాలని అకడి వ్యాపారులను ఆదేశించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బాటసింగారంలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించిన తర్వాతే తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.