హైదరాబాద్: రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణాగా మార్చేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్కార్డ్తో ఒప్పందం కుదుర్చుకున్నది. డిజిటల్ స్టేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. మాస్టర్కార్డ్ వీసీ, అధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మధ్య ఆ డీల్ కుదిరింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరైన తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్కార్డ్తో జరిగిన ఒప్పంద భాగస్వామ్యంతో.. ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో వెల్లడించారు. మాస్టర్కార్డ్తో రాష్ట్రంలో పౌర సేవలను అత్యంత వేగంగా డిజిటైజ్ చేయవచ్చు అన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై ఫోకస్ పెట్టడంతో పాటు రైతులకు కూడా డిజిటల్ సేవలను అందించవచ్చు అని మంత్రి తన ట్వీట్లో తెలిపారు. డిజిటల్ స్టేట్ పార్ట్నర్షిప్లో భాగంగా మాస్టర్కార్డ్తో కీలక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పనిచేయనున్నట్లు మంత్రి చెప్పారు.
In line with its vision of a Digital Telangana, the Govt. of Telangana entered into an MoU with @Mastercard to formalize a Digital State Partnership. The announcement was made in the presence of Minister @KTRTRS & Mastercard VC & President Michael Froman in Davos #InvestTelangana pic.twitter.com/zHx23l3Wra
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 26, 2022